తమ ప్రభుత్వానికి దేశాభివృద్ధి ప్రాధాన్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతామని చెప్పారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడటం తమ వల్ల కాదన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు రోజుల పర్యటనకు నిన్న వచ్చిన ఆయన, ఇవాళ పశువుల మేళాను ప్రారంభించారు. దేశంలో పాడి సంపదను పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్వచ్ఛత, పన్ను సంస్కరణల అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. పరిశుభ్రత ద్వారానే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.