సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్. ఎన్ని పార్టీలు ఏకమై ఎన్నికల్లో పోటీ చేసినా టీబీజీకేఎస్ విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ-3 ఏరియాలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి వివేక్తో పాటు ఎమ్మెల్యే పుట్టమధు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో సింగరేణి సంఘాలకు చెందిన కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కేసులు వేసి ఆపేశారని మండిపడ్డారు.