హైదరాబాద్ : సోమవారం మధ్యాహ్నం నగరం తడిసి ముైద్దెంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంబర్పేట్, విద్యానగర్, ఓయూ, తార్నాక, ముషీరాబాద్, సికింద్రాబాద్, ప్యాట్నీ, బోయిన్పల్లి, హయత్నగర్, ఎల్బీనగర్, కాప్రా, కార్వాన్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, ఫలక్నూమా, రాజేంద్రనగర్తో పాటు పలు ప్రాంతాల్లో వాన పడింది. దీంతో ఆ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.