హైద్రాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీల్ చైర్ లిఫ్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఇలాంటి సదుపాయాన్ని కల్పించిన మొదటి విమానాశ్రయంగా రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. `వెర్టి-లిఫ్ట్` అని పిలిచే ఈ లిఫ్ట్ సాయంతో దివ్యాంగులు తమ బ్యాగేజీ కౌంటర్కి, చెకిన్ కౌంటర్కి త్వరగా చేరుకునే అవకాశం కలగనుంది. వారు ఎక్కువ సేపు ఎదురుచూడకుండా ఉండేందుకు `యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్`లో భాగంగా ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు. దీంతో పాటు పార్కింగ్ వద్ద, ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలోనూ దివ్యాంగుల కోసం కొన్ని కొత్త సదుపాయాలు అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్పోర్ట్ సీఈఓ ఎస్జీకే కిషోర్ తెలిపారు. గత నెల ప్రారంభించిన `ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్` కార్యక్రమం ద్వారా ఇతర ప్రయాణికులకు కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.