అస్తవ్యస్తంగా ఉన్న భూరికార్డులను ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. భూసర్వేలో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 88 శాతం సర్వే నిర్వహించారన్న మహమూద్ అలీ మరో 15 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తూ సూర్యాపేటలో ఆయన ఆగారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సూర్యాపేటలో ఘనస్వాగతం లభించింది.