ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారసత్వం కాంగ్రెస్‌ సంప్రదాయం: అమిత్‌షా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 03:01 PM

రాహుల్‌ గాంధీ చెప్పిన వారసత్వ సంప్రదాయం కాంగ్రెస్‌ది మాత్రమేనని, దేశానిది కాదని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. సోమవారం దిల్లీలో భాజపా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అమిత్‌షా ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విమర్శల వర్షం కురిపించారు.‘అమెరికా పర్యటనలో రాహుల్‌గాంధీ చెప్పిన వారసత్వ సంప్రదాయం పూర్తిగా అవాస్తవం. దేశంలో అటువంటి సంస్కృతి ఎక్కడా లేదు. ఒక్క కాంగ్రెస్‌లో తప్ప. భాజపా విజయాలే అందుకు నిదర్శనం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో అవినీతి జరిగింది.

గత మూడేళ్లలో భాజపాకు వ్యతిరేకంగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు’ అని అమిత్‌షా అన్నారు. భాజపా కార్యవర్గ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా 13 మంది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు.ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్‌ వారసత్వ విధానం పై మాట్లాడిన విషయం తెలిసిందే. భారత్‌లో ఆ సంప్రదాయం ఉందని అంబానీలు, అభిషేక్‌ బచ్చన్‌ అలా వచ్చిన వారేనని చెప్పారు. స్టాలిన్‌, అఖిలేశ్‌ యాదవ్‌ వంటి రాజకీయ నాయకులు కూడా వారసత్వం ద్వారా ఎదిగిన వారే అని రాహుల్‌ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com