జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం నీటితో కళకళలాడుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి నీరు చేరుకుంది. జూరాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 318.16 మీటర్లు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్థ్యం 8.929 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 9.657 టీఎంసీలు. ఇన్ఫ్లో -లక్షా 25 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో - 1,08,360 క్యూసెక్కులుగా ఉంది.