ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారసత్వ ఉద్యోగాలను కాపాడుకుంటాం :మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 06:46 PM

మంచిర్యాల: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే వారసత్వ ఉద్యోగాలు సాధ్యమని, వారసత్వ ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఎంతటి వరకైనా పోరాడుతామని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కాగా ఈ రోజు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సింగరేణి డివిజన్‌ పరిధిలోగల ఆర్‌కే 7 న్యూటెక్‌ గని దగ్గర టీబీజీకే గేట్‌ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే దివాకర్‌రావు హాజయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర గొప్పదన్నారు. జాతీయ సంఘాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, సింగరేణి కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. వారసత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే హక్కు జాతీయ సంఘాలకు లేదని, సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌నే గెలిపించాలంటూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. అనంతరం పలు జాతీయ సంఘాలకు చెందిన 100 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com