హైదరాబాద్:తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఓ కాంగ్రెస్ దొంగ అని, కాంగ్రెస్ దొంగల బండిలో కోదండరాం సభ్యుడిగా చేరాదంటూ తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవ చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. కాగా ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కుట్రలతో ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నారన్నారు. అడ్వకేట రచనారెడ్డి ఓ కాంగ్రెస్ కార్యకర్తన్నారు. అప్పనంగా భూములు కట్టబెట్టి సీబీఐ విచారణ చేయించుకున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.