ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 08:22 AM

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సలహా మండలిని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్‌ సభ్యుడు బిబేక్‌ దేబ్రాయ్‌ నేతృత్వంలో ఈ సలహా మండలిని ఏర్పాటుచేశారు. ఈ మండలిలో సభ్యులుగా డాక్టర్‌ సూర్జిత్‌ బళ్లా, రతిన్‌ రాయ్‌, డాక్టర్‌ అషీమా గోయల్‌, సభ్య కార్యదర్శిగా రతన్‌ వటల్‌ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై ఈ మండలి ప్రధానికి సలహాలు ఇవ్వనుంది. దేశంలోని కీలక అంశాలపై ప్రధాని కోరినా లేదా సుమోటోగానైనా వివిధ అంశాలపై సూచనలివ్వనుంది. ప్రధాని కోరిక మేరకు సమయానుకూలంగా నివేదికలను సైతం రూపొందిస్తుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com