సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో భాగంగా కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ఎస్ అండ్ పీసీ, సెంట్రల్ వర్కుషాప్, సింగరేణి ప్రధాన కార్యాలయం, కోల్ టెస్టింగ్ ల్యాబ్, సెంట్రల్ ఆటో వర్కుషాప్, సింగరేణి ప్రధాన ఆసుపత్రి విభాగంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలగం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. వారసత్వ ఉద్యోగాలు అమలయ్యేలా సీఎం కేసీఆర్ ఖచ్చితoగా చూస్తారని పేర్కొన్నారు.