హైదరాబాద్ : భాగ్యనగరంలో జరిగే మహా బతుకమ్మ వేడుకలకు జిల్లాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మండల కేంద్రాల నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మహిళలు బతుకమ్మలతో హైదరాబాద్కు పయనమవుతున్నారు. ప్రత్యేక బస్సులను స్థానిక టీఆర్ఎస్ నేతలు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2 వేల మంది మహిళలు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. గిన్నిస్ రికార్డు సాధించే దిశగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మ వేడుకలను ఏర్పాట్లు చేస్తున్నారు.