ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 01:57 PM

రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికాం కంపెనీలు ఎప్పుడూ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ తన వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు గాను కొత్త ప్యాక్‌లను ప్రవేశపెడుతూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు పోస్ట్‌పెయిడ్ యూజర్లకు అనేక ఆఫర్లను అందజేసిన ఎయిర్‌టెల్ తాజాగా ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా ఓ నూతన ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.999తో వారు రీచార్జి చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో 112 జీబీ ఉచిత 4జీ మొబైల్ డేటా లభిస్తుంది. రోజుకు గరిష్టంగా దీన్ని 4జీబీ వరకు వాడుకోవచ్చు. ఇక దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. వారానికి 1000 నిమిషాల వరకు ఉచితంగా వాడుకోవచ్చు. కాగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా వినియోగదారులు రీచార్జి చేసుకుంటే దాంతో 50 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com