భూపాలపల్లి : రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పర్యటించారు. ఈ సందర్భంగా మొహర్రం వేడుకల్లో పాల్గొన్న స్పీకర్.. తెలంగాణ ప్రజలకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. మత సామరస్యం తెలంగాణకే సొంతమన్నారు. ఒకప్పుడు తెలంగాణ గ్రామాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోకపోవడం వల్ల ముస్లింలు వలస వెళ్లారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. తిరుమలగిరిలోని ముస్లింలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.