అన్ని వర్గాల కోసం టీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మద్దిరాల మండల కేంద్రంలో సంచార పశువైద్యశాల అంబులెన్స్ను ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రారంభించారు. అనంతరం వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికుల కోసం కార్యాలయాన్ని ప్రారంభించి….సర్వసభ్యసమావేశంలో ఎమ్మెల్యేతోపాటు జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. చేనేత కార్మికులకు సర్కారు అన్ని విధాలా ప్రోత్సాహమందిస్తోందన్నారు.