సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జాతీయ సంఘాల పని ఖతమైపోయిందని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్మికలోకమంతా సిద్ధంగా ఉందని చెప్పారాయన. మంచిర్యాల జిల్లా మందమర్రిలో టీబీజీకేఎస్ ప్రచారానికి మంచి స్పందన లభించింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే చిన్నయ్య ఈ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.