గుజరాత్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో బలీయమైన పటేల్ వర్గం మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యత్నిస్తున్నారు. తన ప్రచారాన్ని పటేల్ వర్గం బలీయంగా ఉన్న ప్రాంతాల్లో ప్రారంభించారు. జామ్నగర్నుంచి రాజ్కోట్కు బయలుదేరి వెళుతున్న సమయంలో ఎన్ఎస్యుఐ విద్యార్థులు రాహుల్ను సత్కరించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు.