నెల్లూరు: బారాషాహీద్ దర్గా దగ్గర వచ్చే నెల 1వతేదీ నుంచి జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఒకటో తేదీ నుంచి 5వతేదీ వరకు రొట్టెల పండగ జరగనుంది. ఈసందర్బంగా మంత్రి నారాయణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ఈఏడాది 14 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే బారాషాహీద్ దర్గా దగ్గర రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే దర్గా ప్రాంతాన్ని రూ.50 కోట్లతో టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.