పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో మంగళవారం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగరేణి ఎన్నికలతో సీఎం కేసీఆర్కు చుక్కలు చూపించాలన్నారు. కార్మికుల శ్రమను తెలంగాణ ప్రభుత్వం దోపిడి చేస్తోందన్నారు. శాసనసభ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ గోదావరిఖనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏమైందని ప్రశ్నించారు. 2012లో ఓసిపీలతో సింగరేణి బొందలగడ్డగా మారిందన్న కేసీఆర్ మూడేళ్ళలో కొత్తగా 13 ఓసిపిలు ఏర్పాటు చేశారని తెలపారు. సింగరేణి కార్మికులను ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయటానికి యత్నిస్తున్నారని.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను మూడేళ్లలో 80 వేల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు.