ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2020 కల్లా.. 5జీ ఇండియా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 04:58 PM

 టెక్నాలజీ రంగంలో 5జీ సేవలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని కోసం ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసింది. 2020 కల్లా 5జీ సేవలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. 5జీ వైర్‌లెస్ టెక్నాలజీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా 2020 కల్లా విస్తరించే అవకాశాలున్నాయి. దానికి తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. 5జీ యాక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 500 కోట్లతో కార్పస్ ఫండ్‌ను క్రియేట చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రీసర్చ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నది. 5జీ టెక్నాలజీ సేవల కింద ప్రభుత్వం సుమారు ఒక సెకండ్‌కు 10 వేల మెగాబైట్ల డేటాను నగర ప్రాంతాల్లో అందిచనున్నది. గ్రామీణ ప్రాంతాలకు సుమారు వెయ్యి ఎంబీపీఎస్ అందిస్తారు. 5జీ కోసం వేసే కమిటీలో.. టెలికామ్ శాఖ, ఎలక్ట్రానిక్స్-ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శులు ఉంటారు. 5జీ టెక్నాలజీ వల్ల దేశానికి ఆర్థిక లాభాలు కూడా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com