అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వివేక్ చెప్పారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలో టీబీజీకేఎస్కు మద్దతుగా వివేక్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన కార్మికులు టీబీజీకేఎస్ లో చేరారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించే సత్తా సీఎం కేసీఆర్ కే ఉందన్నారు. జాతీయ సంఘాల మోసపూరిత హామీలను కార్మికులు నమ్మవద్దని సూచించారు. కార్మికులంతా టీబీజీకేఎస్కు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.