హైదరాబాద్: కృష్ణా జలాల వివాదాలపై కేంద్ర జలవనరుల సంఘం మాజీ ఛైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీతో ఇవాళ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు భేటీ అయ్యారు. జలసౌధలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు, కృష్ణా యాజమాన్య బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం, కృష్ణా బేసిన్కు తరలిస్తోన్న గోదావరి జలాల వాటాతో పాటు బోర్డు నిర్వహణపై విధివిధానాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించనుంది.