ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులతో బజాజ్‌ కమిటీ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 13, 2017, 01:01 PM

హైదరాబాద్: కృష్ణా జలాల వివాదాలపై కేంద్ర జలవనరుల సంఘం మాజీ ఛైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీతో ఇవాళ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు భేటీ అయ్యారు. జలసౌధలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు, కృష్ణా యాజమాన్య బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం, కృష్ణా బేసిన్‌కు తరలిస్తోన్న గోదావరి జలాల వాటాతో పాటు బోర్డు నిర్వహణపై విధివిధానాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com