ద్వారక: పదిహేను రోజులు ముందుగానే దీపావళి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని ద్వారకలో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ కింద 27 వస్తువులపై పన్ను తగ్గిస్తూ.. జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని స్వాగతించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలకు 15 రోజుల ముందుగానే దీపావళి వచ్చిందన్నారు. మూడు నెలల పాటు జీఎస్టీ గురించి పూర్తి అధ్యయనం చేయనున్నట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ మండలిలో ఏర్పడ్డ ఏకాభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. ఓకా, బెట్ ద్వారక మధ్య బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇవాళ ప్రధాని శంకుస్థాపన చేశారు.