సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరల్డ్ కప్ గెలచినట్లు ఫీలవుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతారావు పేర్కొన్నారు. కూతురు కవిత కోసం కేసీఆర్ సింగరేణిలో సర్వశక్తులు ఒడ్డారన్నారు. అలాగే గత ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది కేసీఆరేనని వీహెచ్ అన్నారు. కోదండరాంపై ఇంత దిగజారి మాట్లాడడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టే కేసీఆర్ను ప్రశ్నిస్తున్నామని హనుమంతారావు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దొర అయితే సైన్యంలో పనిచేసే వారు కాదు . ముఖ్యంత్రి కేసీఆర్ ని పొగడడమే గవర్నర్ పనిగా పెట్టుకున్నారని, గవర్నర్ ఓ టీఆర్ఎస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని వీహెచ్ విమర్శించారు.