ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిషన్ కాకతీయపై మంత్రి హరీశ్ సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2017, 10:38 AM

హైదరాబాద్: మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో మంత్రి హరీశ్‌రావు శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల నాణ్యతలో రాజీపడవద్దని అధికారులకు సూచించారు. పనుల తీరులో పొరపాట్లు, అవకతవకలు లేకుండా చూడాలని చెప్పారు. మొదటి దశ పనులను నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలన్నారు. రెండో దశ పనులు కూడా డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మూడో దశ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి నాలుగో విడత కోసం పనులను గుర్తించి నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. హరితహారాన్ని అనుసంధానించి చెరువు కట్టకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. అన్ని చెరువులకు జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com