తెలుగు రాష్ట్రాలలో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో సాధారణం కంటే 72 శాతం అధిక వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.