న్యూఢిల్లీ : తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. రేపట్నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు అన్ని రాష్ర్టాల గవర్నర్లు హాజరు కానున్నారు.