హైదరాబాద్: నేడు అర్బన్ గ్రీన్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష మొక్కలను జీహెచ్ఎంసీ నాటనుంది. ఈ కార్యక్రమాన్ని బోయినపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ ప్రియంకా వర్గీస్ ప్రారంభించారు. ఈసందర్భంగా హరిత హారంలో ప్రియాంకా పాల్గొని మొక్కలు నాటారు. పటాన్చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, చర్లపల్లిలో మేయర్ బొంతు రామ్మోహన్ హరితహారంలో పాల్గొన్నారు.