మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఖమ్మం ఎన్ఎస్టీ క్యాంపులో డీపీఆర్సీ బిల్డింగ్ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. తర్వాత ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో అదనపు తరగతి గదులను మంత్రి తుమ్మల ప్రారంభించారు.