నల్గొండ: గంగోత్రి విహారయాత్రలో విషాదం నెలకొంది. నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు నీటమునిగి మృతిచెందాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన బొమ్మిడి నరహరి అనే యువకుడు డెహ్రాడూన్లోగల డీఎస్బీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. అయితే... తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు గంగోత్రికి వెళ్లాడు. అక్కడ ఉన్న నదిలో స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ నీళ్లల్లో మునిగిపోవడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. దీంతో ఆ యువకుడి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.