ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిలోఫర్ దవాఖానలో ఓపీ సమయం పొడిగింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 14, 2017, 11:11 AM

హైదరాబాద్ : రోగుల సౌకర్యార్ధం నిలోఫర్ దవాఖానలో ఓపీ సేవల సమయాన్ని గంటన్నర పొడిగించినట్లు ఓపీ బ్లాక్ ఆర్‌ఎంఓ డా.రమేష్ దాంపురి తెలిపారు. మొన్నటి వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండేవని, 11గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసేవారని తెలిపారు. ఈనెల 10నుంచి ఓపీ సేవలను గంటన్నర పాటు పొడిగించినడంతో ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం 1.30గంటల వరకు ఓపీ సేవలు అందుబాటు ఉంటున్నట్లు ఆయన వివరించారు. మధ్యాహ్నం 12.30గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ ఉంటుందని, 1.30గంటల వరకు ఓపీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 12.30లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రోగులందరికీ ఎంత సమయమైన వైద్యసేవలు కల్పించనున్నట్లు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com