కోల్కతా: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇవాళ ఆయన స్థానిక వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) నిర్వహించిన ఇంటరాక్టివ్ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఈవో వినయ వర్మలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.