హైదరాబాద్ : రాష్ట్రంలోని మూడు జిల్లాస్థాయి న్యాయస్థానాలను ప్రస్తుత స్థానాల నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలకు తరలిస్తూ రాష్ట్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఆమోదంతో తరలింపు చేపట్టినట్టు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వీ నిరంజన్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో భూపాలపల్లిలో మొదటిసారిగా న్యాయస్థానం ఏర్పాటుకానున్నది.