రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని "రన్ ఫర్ హీరోస్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన పరుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశం కోసం, సమాజం కోసం ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలు వెల కట్టలేనివని తెలిపారు. సమాజ హితం కోసం అమర జవాన్ల అడుగుజాడల్లో నడుస్తూ శాంతి, సౌబ్రాతృత్వం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరుగు కార్యక్రమంలో సైబరాబాదు కమీషనర్ సందీప్ సాండిల్య, ఎమ్మెల్యే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.