హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ అవార్డులను ప్రకటించింది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా స్వచ్ఛతా కార్యక్రమాలు పాటించే హోటళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, కాలనీ సంక్షేమ సంఘాలకు జీహెచ్ఎంసీ స్వచ్ఛ అవార్డులు ప్రకటించింది. స్వీయ మూల్యాంకన ఆధారంగా ఒక్కో విభాగానికి ఒక్కో ప్రమాణాలతో ర్యాంకులు కేటాయించారు. కమిషనర్ డాక్టర్ బీ. జనార్దన్రెడ్డి స్వచ్ఛ అవార్డులను వెల్లడించారు.