వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలం కందనెల్లి దగ్గర విషాద సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు రమేష్ అనే వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. మృతుడు మన్సన్పల్లివాసి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.