టీఆర్ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్భాస్కర్ హాజరయ్యారు. సమావేశంలో ఈ నెల 22న జరిగే సీఎం కేసీఆర్ సభ విజయవంతంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ.. ఈ నెల 22న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశానికే తలమానికం కానుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 20 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమతో చేనేత కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎంతోమంది ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్దే విజయమని పేర్కొన్నారు.