ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 12:40 PM

టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ హాజరయ్యారు. సమావేశంలో ఈ నెల 22న జరిగే సీఎం కేసీఆర్ సభ విజయవంతంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ.. ఈ నెల 22న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ దేశానికే తలమానికం కానుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 20 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమతో చేనేత కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎంతోమంది ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయమని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com