ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ దేశానికే ఆదర్శం: సత్యవతి రాథోడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 02:21 PM

టెక్స్‌టైల్ పార్క్ దేశానికే ఆదర్శమని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇవాళ పరకాల శాసనసభ్యుల కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సత్యవతి జిల్లాలో జరగబోయే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే టెక్స్‌టైల్ పార్క్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. టెక్స్‌టైల్ పార్క్ కోసం 1200 ఎకరాలు సేకరించామన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌పై ప్రతిపక్షాలకు ఉన్న సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతారని సత్యవతి స్పష్టం చేశారు. ఈ నెల 22న జిల్లాలోని గీసుకొండ మండలం చింతలపల్లిలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు శాయంపేటలో సీఎం బహిరంగ సభ ఉండనుంది. తర్వాత కాజీపేటలో వంతెన విస్తరణ పనులకు, వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com