గుండాల: జనగామ జిల్లాలోని గుండాల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్ఐ పురేందర్ భట్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నేపథ్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ నిర్వహించిన క్యాంపులో మొత్తం 106 మంది రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటీ కూడా పాల్గొన్నది.