మహబూబ్నగర్: జడ్చర్ల మండలం బాదేపల్లి మినీ స్టేడియంలో రూ.90 లక్షలతో చేపట్టనున్న ఆధునీకరణ పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడలకు కూడా పెద్దపీట వేస్తున్నదని స్పష్టం చేశారు. వాళ్లొస్తరు..వీళ్లొస్తరని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఎవరొచ్చినా రాబోయే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ దే అధికారమని లక్ష్మారెడ్డి పునరుద్ఘాటించారు. స్థానికుడు కాదని కల్వకుర్తిలో ఎన్టీఆర్ ను ప్రజలు ఓడగొట్టిన విషయాన్ని మంత్రి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.