తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా చేపడుతున్న కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ శంకుస్థాపన చేసేందుకు వరంగల్ జిల్లా అధికారులు అన్నీ యేర్పాట్లు సిద్దం చేస్తున్నారు ఈ నెల 22 న ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదగా శంకుస్థాపనకు ఏర్పాట్లను డిప్యూటి సి యం కడియం శ్రీహరి పరిశీలించారు . వరంగల్ రూరల్ జిల్లా లోని గీసుకొండ మండలం శాయంపేట సంగెం మండలం చింతలపెల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 22 న శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం పాల్గొనే భారీ బహిరంగ సభ కు దాదాపు 2 లక్షల మంది ప్రజలు కార్యకర్తలు పల్గోనన్నున్నారని అందుకోసం సభ కు వచ్చే నాలుగు వైపులా రహదారులను విస్తరించాలని ,సభ ప్రాంగణం పక్కన ముఖ్యమంత్రి దిగే హెలిపాడ్ ,వాహనాలు నిలుపు చేసేందుకు పార్కింగ్ స్థలాలు ,సభ ప్రాంగణం లో మహిళలకు ప్రత్యక గ్యాలరీలు ,వి ఐ పి లు ,మీడియా గ్యాలరీ ,ఎల్ ఇ డి స్క్రీన్ లు ,ధూం ధాం కళాకారులకు ఏర్పాట్లు ను పరిశీలించారు .
అనంతరం సంబదించిన శాఖా ల అధికారులతో మాట్లాడారు పలు సూచనలు చేశారు ..ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,పోలీసుకమిష్ నర్ సుధీర్ బాబు,మేయర్ నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు .