బీసీలకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ. 102.8 కోట్లు మంజూరు చేశారు. రాయితీ రుణాల ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. రాయితీ రుణాల తో 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది. BCలకు నిధుల మంజూరు చేయడంపై మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. 12 ఫెడరేషన్స్ లబ్ధిదారులకు వెంటనే రాయితీ రుణాలిస్తామన్నారు. సీఎం కేసీఆర్ కు మంత్రి జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు