జగిత్యాల: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో ఓ వ్యక్తిపై కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రాజన్న అనే వ్యక్తిపై కొందరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. కాగా కాల్పుల సమయంలో దుండగులు తమను నక్సలైట్లుగా చెప్పుకున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.