ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైల్స్తో వెళ్తున్న లారీ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది వ్యక్తులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో లారీలో 18 నుంచి 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం మీర్జాలో గల ఆస్పత్రికి తరలించారు. మృతులంతా దినసరి కూలీలు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.