ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2017, 10:49 AM

హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. నగరంలోని గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమలరవీరుల సంస్మరణ దినోత్సవానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు. వీరంతా పోలీసు అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హోంమంత్రి నాయిని తపాలా బిల్ల, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నరని కొనియాడారు. పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నరన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసు అమరవీరుల త్యాగాలకు మనమంతా రుణపడి ఉండాలన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com