నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 30 సంవత్సరాలు ఉన్న యువకుడు పట్టాలపై తలను ఉంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిపై నుంచి రైలు వెళ్లడంతో తల, మొండెం వేరయ్యాయి. సమాచారం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.