మేడ్చల్: జిల్లాలోని ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ చెరువులో చేపలు భారీగా మృతిచెందాయి. కలుషిత జలాలు కలవడం వల్లే చేపలు మృతిచెందినట్లుగా సమాచారం. మృతిచెందిన చేపల విలువ సుమారు రూ. 8 లక్షలు. జవహర్నగర్ డంపింగ్యార్డు నుంచి రసాయన వ్యర్థాలు చెరువులో కలవడం వల్లే చేపలు మృతిచెందినట్లు ఆరోపణ. స్థానికులతో కలిసి మత్య్సకారులు చెరువు వద్ద ఆందోళనకు దిగారు. జవహర్నగర్ డంపింగ్ యార్డ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.