హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కిషన్రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులతోపాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్బంగా వీరిమధ్య చర్చ జరిగింది. టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరే అంశంతోపాటు బీజేపీలో కొనసాగుతున్న నాగం జనార్ధన్రెడ్డి కూడా రేవంత్రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరబోతున్నారన్న విషయంపై నేతలు చర్చించినట్లు సమాచారం.