ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సీఎం కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2017, 03:51 PM

హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవలను సీఎం స్మరించుకున్నారు. ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారి సేవలను జాతి ఎన్నటికీ మరవదని సీఎం కేసీఆర్ ఈసందర్భంగా అన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com